byసూర్య | Fri, Aug 19, 2022, 11:33 PM
శుక్రవారం ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ను సీపీఐ నేతలు కలిశారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. మొన్నటి ఉప ఎన్నికలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం సీపీఐ నేతలు కీలక ప్రకటన చేశారు. ప్రగతిశీల శక్తులు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో తాము టీఆర్ఎస్కే మద్దతు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.