byసూర్య | Fri, Aug 19, 2022, 09:40 PM
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ ఈ నెల 21న వస్తున్నారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 4.15 గంటలకు మునుగోడు చేరుకుంటారు. సాయంత్రం 4.35 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో స్వల్ప సమీక్ష ఉంటుంది. అనంతరం 4.40 నుంచి 6 గంటల వరకు అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు.సభ అనంతరం రోడ్డు మార్గంలో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటారు. 6.45 నుంచి 7.30 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటారు. అనంతరం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. అక్కడ 8 నుంచి 9.30 వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.