తాడ్వాయిలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

byసూర్య | Fri, Aug 19, 2022, 09:12 PM

ములుగు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసు అధికార్లు.  ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తాడ్వాయి మండలంలోని వీరాపురం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో.. శుక్రవారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు సమీపంలోని అడవుల్లో కూంబింగ్‌ నిర్వహించే పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. తప్పించుకునే క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. అయితే.. ఇరుపక్షాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.


కొన్ని రోజులుగా తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు పోలీసులు గుర్తించి కూంబింగ్ చేపట్టారు. పోలీసులు అనుమానించినట్టే.. శుక్రవారం మావోయిస్టులు తాడ్వాయి మండలంలో రహస్యంగా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనతో.. ములుగు జిల్లాలో హై అలెర్ట్ నడుస్తోంది. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానంగా ఉన్న ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


Latest News
 

కవితకు బిగ్ షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు.. అప్పటిదాకా జైలులోనే Tue, Apr 23, 2024, 07:39 PM
కల్పన అనేది అబద్ధంలో దాగున్న నిజం.. ఆలోచింపజేస్తున్న స్మితా సబర్వాల్ ట్వీట్ Tue, Apr 23, 2024, 07:31 PM
పెళ్లి తర్వాత మళ్లీ బరిలో దిగిన బర్రెలక్క.. ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పోటీగా Tue, Apr 23, 2024, 07:27 PM
ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం Tue, Apr 23, 2024, 07:23 PM
10 ఎంపీ సీట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్ ఏం చేయగలదో చూపిస్తాం: కేటీఆర్ Tue, Apr 23, 2024, 07:19 PM