తాను సోనియా గాంధీకి మాత్రమే ఏజెంట్ ను: మాణకం ఠాగూర్

byసూర్య | Wed, Aug 17, 2022, 06:18 PM

తాను సోనియా గాంధీకి మాత్రమే ఏజెంట్ నని, మరెవరికీ ఏజెంట్ ను కానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, రేవంత్ రెడ్డికి మాణికం ఠాగూర్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ స్పందించారు. తాను సోనియా గాంధీకి మాత్రమే ఏజెంట్ నని, మరెవరికీ ఏజెంట్ ను కానని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ కెప్టెన్ మాత్రమేనని, నేతల కంటే పార్టీయే ముఖ్యమని ఉద్ఘాటించారు. తెలంగాణ పరిస్థితులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్రానికి మధ్య వారధి లాంటి వాడినని మాణికం ఠాగూర్ వెల్లడించారు. 


ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు సన్నిహితుడని, తన నివాసానికి ఆహ్వానించి బిర్యానీతో విందు ఇచ్చాడని చెప్పారు. బీజేపీలోకి వెళ్లినవారే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా ప్రియాంక గాంధీ వస్తే సంతోషమేనని తెలిపారు.


Latest News
 

ఎమ్మెల్సీ ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి Thu, Mar 28, 2024, 04:06 PM
పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి Thu, Mar 28, 2024, 04:04 PM
ఆడకూతురు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం Thu, Mar 28, 2024, 04:02 PM
రుణాలను, సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డీసీసీబీ డైరెక్టర్ Thu, Mar 28, 2024, 04:01 PM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ఖాయం: ఎమ్మెల్యే మేఘారెడ్డి Thu, Mar 28, 2024, 03:57 PM