byసూర్య | Wed, Aug 17, 2022, 06:16 PM
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డిల వివాహం ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జరిగింది. ఈ క్రమంలో ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. అయితే, పెళ్లి రిసెప్షన్ ను ఖమ్మం ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలోని 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. రిసెప్షన్ వేదికనే 30 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు విచ్చేసే అతిథుల వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తన కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు లక్షల కుటుంబాలకు శుభలేఖతో సహా గోడ గడియారం కూడా అందించి ఆహ్వానించారు.
ఇదిలావుంటే రిసెప్షన్ కోసం రాజస్థాన్ ప్యాలెస్ సెట్టింగ్ ను వేశారు. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఈ సెట్టింగ్ ను నిర్మించారు. మూడు లక్షల మందికి అదిరిపోయే రీతిలో విందు భోజనాలు సిద్ధం చేశారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలకు ప్రసిద్ధిచెందిన యాదమ్మతో పలు వంటకాలు వండించారు. ఈ రిసెప్షన్ కు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో, భద్రత కోసమే 1,500 మంది సిబ్బందిని వినియోగించారు.