ఉచితంగా 6 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ
byసూర్య |
Wed, Aug 17, 2022, 05:07 PM
ఈ నెల 31 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే, సెప్టెంబర్ 9న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Latest News