ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల నిధులు: కేసీఆర్
byసూర్య |
Wed, Aug 17, 2022, 04:58 PM
నియోజకవర్గాల అభివృద్ధి నిమిత్తం ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవంలో బుధవారం ఆయన మాట్లాడారు. రూ.2,78,500ల తలసరి ఆదాయంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అని చెప్పారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. భారతీయులంతా కుల, మత బేధాల్లేకుండా వృద్ధి చెందాలన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్నారు. విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Latest News