పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న ఎమ్మెల్యే
byసూర్య |
Wed, Aug 17, 2022, 03:23 PM
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సొంత నిధులతో నియోజక వర్గంలో 11 వేల మంది విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్ , పెన్స్, డిక్షనరీ, బ్యాగ్ తో కూడిన కిట్లను అందిస్తున్నారు. ఈ నేపద్యంలో బాలానగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 150 మంది విద్యార్థులకు అందించారు. ఈ కార్య క్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీంద్ర రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.
Latest News