రక్తదాన శిబిరం పేదలకు వరం: ఎమ్మెల్యే
byసూర్య |
Wed, Aug 17, 2022, 03:20 PM
75వ భారత వజ్రోత్సవాల సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని మహమ్మదీయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలతో, రక్తదాన శిబిరాన్ని ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఏసీబీ యాదగిరి, రాష్ట్ర యువనాయకులు ముఠా జై సింహా, ముషీరాబాద్ సిఐ జాంగిర్ యాదవ్, డాక్టర్ పద్మ, తెరాస సీనియర్ నాయకులు బింగి నవీన్, ముషీరాబాద్ నియోజకవర్గ వివిధ డివిజన్ల ప్రెసిడెంట్లు వై శ్రీనివాస్, వల్లాల శ్యామ్ యాదవ్, రాకేష్ కుమార్, రావులపాటి మోజస్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ ప్రసాద్, కార్యదర్శులు దామోదర్ రెడ్డి, ఆకుల అరుణ్, సురేందర్, సాయి కృష్ణ, తెరాస సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Latest News