byసూర్య | Wed, Aug 17, 2022, 12:48 PM
ములుగు జిల్లా కేంద్రంలోని 163వ జాతీయ రహదారిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం సిఎం కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రజాసంగ్రామ యాత్రతో బిజెపికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వ లేక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో దాడి చేపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, జిల్లా కార్యదర్శి రవీంద్రాచారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి, సిరికొండ బలరాం, గాదం కుమార్, బాణాల రాజ్ కుమార్, అశోక్, ప్రవీణ్, నాగసాయి, మహేష్ పాల్గొన్నారు.