byసూర్య | Wed, Aug 17, 2022, 12:46 PM
ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గడ్డం సుభద్రను ఎన్నిక చేయడం జరిగినది. హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జస్టిస్ చంద్రయ్య పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల ప్రాంతానికి చెందిన గడ్డం సుభద్రను మంగళవారం ఎన్నుకున్నారు. 15 సంవత్సరాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల కోసం సామాజిక సేవలందిస్తూ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉద్యమం చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జస్టిస్ చంద్రయ్య, మాట్లాడుతూ. మహిళల చట్టాలు గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని వరంగల్ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కాబడ్డ గడ్డం సుభద్ర కి సూచనలు అందించారు. ప్రభుత్వ అధికారులతో సహాయ సహకారాలు అందిస్తూ. మహిళలకు హక్కుల కోసం సామాజిక సేవలు అందించాలని సూచించారు. ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా పాలకుర్తి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గడ్డం సుభద్ర ని ఎన్నిక చేయడం, అలాగే తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ ఉ మెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎస్కే అహ్మద్ జనరల్ సెక్రెటరీ, తెలంగాణ, రాష్ట్ర అధ్యక్షులకు ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ హైదరాబాద్ అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు ఈ నియమకానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జస్టిస్ చంద్రయ్య కి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర పూల బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.