byసూర్య | Wed, Aug 17, 2022, 12:39 PM
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కన్నెపల్లి మండల కేంద్రంలో మంగళవారం సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కన్నెపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కన్నెపల్లి తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో రాధాకిషన్, ఎంపీవో సతీశ్, ఏపీవో శ్రీనివాస్, కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, సర్పంచులు, పోలీసులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.