byసూర్య | Wed, Aug 17, 2022, 12:35 PM
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజీవ్ తెలిపారు. కమలాపూర్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా జమ్మికుంట వైపు నుంచి ఒకటి, వంగపల్లి నుంచి ఒక ట్రాక్టర్ ద్వారా కమలాపూర్ వైపుకు ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు తారసపడ్డాయి. వారి వద్ద ఇసుక తరలింపుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేక పోవడంతో రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలింపుకు పాల్పడ్డ ముగ్గురిపై కేసు నమోదు చేసి వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఉడుత కుమార్, వంగపల్లికి చెందిన ఎలుకటి మజుందార్ అనే ట్రాక్టర్ డ్రైవర్లు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇకనుండి అక్రమంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా దొంగతనంగా ఎవరైనా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.