byసూర్య | Wed, Aug 17, 2022, 12:32 PM
అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు వారు. భర్త మరణం తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డిలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెండా రాజయ్య(61), లచ్చవ్వ(54) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజయ్యకు మంగళవారం ఛాతిలో నొప్పి వస్తుందని కుమారులకు తెలిపారు. వారు చికిత్స నిమిత్తం గోపాల్పేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో లొంకల్పల్లి గ్రామం సమీపంలో గుండెపోటుకు గురై ద్విచక్రవాహనంపైనే మరణించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా భార్య లచ్చవ్వ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.