byసూర్య | Wed, Aug 17, 2022, 12:31 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ లో చాలా కాలంగా ట్రాక్టర్ డ్రైవర్ గా నీతి, నిజాయతీగా పనులు చేస్తూ, కరోనా విపత్తులో కూడా ముందుండి అధికారులు ఏది చెప్పినా చేసే సాయులు ఉత్తమ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. నవరాత్రుల్లో వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసెందుకు గజ ఈతగడిగా వుంటు, అందరి మన్ననలు పొందేవాడు, అధికారులతో ప్రజలతో మమేకమై నిలిచాడు. డ్రైవర్ సంఘని సాయిలు చేసే విధి నిర్వహణ కు 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15న కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితిష్ వి. పాటిల్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నాడు సాయులు. సాయులును మున్సిపల్ కమిషనర్ జీవన్ తో పాటు మునిస్పాలిటి సిబ్బంది, పాలక వర్గం అభినందించారు.