టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్
byసూర్య |
Wed, Aug 17, 2022, 12:19 PM
జనగామ జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర బుధవారం జనగామకు చేరుకోనుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు బండి సంజయ్కు సవాల్ విసురుతూ.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జనగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Latest News