byసూర్య | Wed, Aug 17, 2022, 12:17 PM
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం, అన్నారం గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను మంగళవారం సాయంత్రం అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి జెడ్పిటిసి కుమార్ గౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్, నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.