byసూర్య | Wed, Aug 17, 2022, 12:02 PM
పాఠశాల బస్సు దిగే క్రమంలో అదుపు తప్పి బస్సు కింద పడటంతో డ్రైవర్ అది గమనించకుండా ముందుకు కదిలించడంతో విద్యార్థి పైనుంచి వెళ్లడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం సాయంత్రం జరిగింది. చిన్నకొండూరు రోడ్డులోని హైస్కూల్ సమీపంలో నివాసం ఉండే గోపాల్, నాగరాణి దంపతుల రెండో కుమారుడు పాలకూర్ల త్రినేశ్(7) మల్లికార్జున పాఠశాలలో చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం బస్సులో ఇంటికి బయలుదేరాడు. హైస్కూల్ వద్ద డ్రైవర్ బస్సును నిలుపగా.. విద్యార్థి త్రినేశ్ బస్సు దిగే క్రమంలో అదుపు తప్పి కిందపడ్డాడు. డ్రైవర్ గమనించకుండానే ముందుకు కదిలించడంతో విద్యార్థి పైనుంచి బస్సు వెనుక టైరు వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి త్రినేశ్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.