టీఆర్ఎస్ కు కొత్త భాష్యం పలికిన బండి సంజయ్

byసూర్య | Wed, Aug 17, 2022, 12:34 AM

టీఆర్ఎస్ అంటే ‘తెలంగాణ రజాకార్ల సమితి’ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకి కొమ్ముకాస్తోందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం పార్టీకి అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్.. నాణేనికి ఉండే బొమ్మా బొరుసు లాంటివని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిజాం తరహా పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. 


సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరపడంలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని.. బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ వీరుల చరిత్రను సమాజానికి తెలియకుండా చేస్తున్నారని ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న బీజేపీ నేతలపై లాఠీఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతృత్వ ధోరణిలో పాలిస్తున్న కేసీఆర్ ను.. ఇంటికే పరిమిత చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


బండి సంజయ్ 14వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర.. విసునూరు నుంచి వడ్డెర కాలనీ, లక్ష్మీనారాయణపురం స్టేజ్, పాలకుర్తి, లక్ష్మీనారాయణపురం, తొర్రూరు, శాతపురం, ధర్మ తండా స్టేజ్ మీదుగా కడవెండి వరకు కొనసాగనుంది. పాలకుర్తిలో నిర్వహించిన 'ప్రజా సంగ్రామ యాత్ర' బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. అయితే.. పాలకుర్తిలో బండి సభను ఫెయిల్ చేసేందుకు కుట్ర చేశారని బీజేపీ ఆరోపించింది. టీఆర్ఎస్ ఆదేశాలతోనే పోలీసులు దగ్గరుండి షాపులన్నీ మూసివేయిస్తున్నారని కమలం నేతలు ఆరోపించారు. రెక్కాడితే గానీ డొక్కాడని చిరు వ్యాపారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM