byసూర్య | Tue, Aug 16, 2022, 02:28 PM
సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి ; జాతీయ సమైక్యత దేశాభిమానం పెంపొందించే విధంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపల్ రెడ్డి తెలిపారు.భారీ ఎత్తున జాతీయ గీతాలాపన నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వేడుకలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు దీనిలో భాగంగా సంగారెడ్డి ఎక్స్ రోడ్ పోతిరెడ్డిపల్లి లోని జాతీయ రహదారిపై ఉద్యోగులు వివిధ సంఘ నాయకులు పాఠశాల విద్యార్థులతో భారీ జాతీయ గీతాలాపన నిర్వహించామన్నారు స్వతంత్ర భారతదేశంలో అన్ని జాతులు కులాలు మతాలు ఉన్నాయని అందరూ సర్వమత సమానంతో మెలిగే విధంగా ఐక్యత చాటాలని తెలిపారు నేటి యువత మహనీయలను ఆదర్శంగా తీసుకొని దేశభక్తి పెంపొందించుకుని ముందుకు సాగాలని ఆయన తెలిపారు ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేదుకు ఈ వజ్రోత్సవ వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి . అందోల్ శాసనసభలు చంటి క్రాంతి కిరణ్. అదనపు కలెక్టర్లు డి సి ఎం ఎస్ శివకుమార్ జిల్లా అధికారులు విద్యార్థులు వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు