byసూర్య | Tue, Aug 16, 2022, 01:24 PM
పటాన్ చెరు మేజా న్యూస్ ; జాతీయ సమైక్యత దేశాభిమానం పెంపొందించే విధంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెరాస రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు చిట్కుల్ గ్రామ పరిధిలో భారీ ఎత్తున జాతీయ గీతాలాపన నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వేడుకలు నిర్వహిస్తున్నామని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు దీనిలో భాగంగా పాఠశాల విద్యార్థులతో జాతీయ గీతాలాపన నిర్వహించామన్నారు స్వతంత్ర భారతదేశంలో అన్ని జాతులు కులాలు మతాలు ఉన్నాయని అందరూ సర్వమత సమానంతో మెలిగే విధంగా ఐక్యత చాటాలని తెలిపారు నేటి యువత మహనీయలను ఆదర్శంగా తీసుకొని దేశభక్తి పెంపొందించుకుని ముందుకు సాగాలని ఆయన తెలిపారు ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేదుకు ఈ వజ్రోత్సవ వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత , వార్డు సభ్యులు దుర్గయ్య, బూజంగాం,మురళీ, వెంకటేశ్, చాకలి వెంకటేశ్, ఉపాధ్యాయులు,విద్యార్థులు, డ్వాక్రా మహిళలు,ఆశా వర్కర్లు, కార్మికులు,యువజన సంఘాలు,గ్రామ ప్రజలు, ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు