byసూర్య | Tue, Aug 16, 2022, 01:23 PM
రాఖీ పండగ సందర్బంగా ఆర్టీసీ తొర్రూరు డిపోకు కాసుల వర్షం కురిపించింది. గత 5 రోజుల్లో రూ. కోటి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 107% ఓఆర్ నమోదు కాగా. 97% ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో తూర్రూరు డిపో అత్యధిక ఆదాయంతో ఫస్ట్ ప్లేస్లో నిలవగా. రాష్ట్రస్థాయిలో థర్డ్ ప్లేస్ సాధించింది. డిపో మేనేజర్ రమేష్ మంత్రి సత్యవతి నుంచి నిన్న అవార్డు అందుకున్నారు.