byసూర్య | Tue, Aug 16, 2022, 01:19 PM
రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం గుర్తుతెలియని రైలు కిందపడి బండారు స్వామి అనే సింగరేణి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్కేపీ స్థానిక సీహెచ్సీలో పనిచేస్తున్న మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంచిర్యాల రైల్వే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంపత్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.