byసూర్య | Tue, Aug 16, 2022, 01:17 PM
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్పార్టీయేనని ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి అన్నారు. సోమవారం సాయంత్రం లక్షెట్టిపేటలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబీకులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలోని రాష్ట్రాలన్ని అభివృద్ధి చెందాయని తెలిపారు.
పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పార్టీ అహర్నిశలు కృషి చేసిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, మాజీ మంత్రి వినోద్, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, ఎంపీపీ అన్నం మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ మండల, పట్ణణాధ్యక్షులు రమేష్, ఆరీఫ్, జెడ్పీటీసీ ముత్తె సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.