భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి

byసూర్య | Mon, Aug 15, 2022, 09:48 PM

భారభర్తల మధ్య మనస్పర్థాలు వారి ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. తన బంధువుల ఇంట్లో బోనాల పండుగకు వెళ్దామని పిలిచినా రాలేదని భార్యపై అలిగిన భర్త ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గంలోని పహాడీషరీఫ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.  పోలీసుల కథనం ప్రకారం.. తుక్కుగూడకు చెందిన సాయి కార్తీక్ గౌడ్ (33) భార్య రవళితో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో జరిగే వివాహం కోసం కందుకూరు మండలంలోని బేగంపేట వెళ్లాడు. అనంతరం భార్యను అక్కడే వదిలి శనివారం ఇంటికొచ్చాడు. మీర్‌పేటలో నిన్న బోనాలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ బోనాలు పండుగ చేసుకుంటున్న తన పిన్ని ఇంటికి వెళ్దామని, వెంటనే రావాలని భార్యకు ఫోన్ చేశాడు.


ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన కార్తీక్ భార్యకు వీడియో కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. మీ తరపు వారి అన్ని ఫంక్షన్లకు వస్తున్నా, మా వాళ్ల ఫంక్షన్లకు ఎందుకు రావడం లేదని నిలదీస్తూనే దూలానికి ఉరివేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన రవళి పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి తన భర్తను కాపాడాలని వేడుకుంటూ ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికి చేరుకునే సరికే కార్తీక్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM