తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించేది మునుగోడు ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి

byసూర్య | Mon, Aug 15, 2022, 08:45 PM

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నిక రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలోని సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లను కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ కూడా పార్టీ మారొద్దని కోరారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా నిలబడదామని చెప్పారు. ఒక్క ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ దే అధికారమని చెప్పారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. ఈ నెల 20 నుంచి తాను మునుగోడులోనే ఉంటానని చెప్పారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM