byసూర్య | Wed, Aug 10, 2022, 11:25 AM
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతుబీమా రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు 13 సాయంత్రం 6 గంటల వరకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రైతు బీమా కోసం ఏఈవోలను రైతులు సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. కొత్త దరఖాస్తులకు, బీమా రెన్యువల్కు ఈ నెల 1వ తేదీ వరకు తొలుత గడువు విధించారు. 3 రోజుల పాటు సైట్ తెరుచుకోక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.