byసూర్య | Wed, Aug 10, 2022, 10:38 AM
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నందు గాంధీ, నెహ్రు, అంబెడ్కర్ విగ్రహాల వద్ద అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా 75 కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు మల్ రెడ్డి రంగారెడ్డి. ఎందరో అమరవీరుల పోరాటం, త్యాగాల వలన భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని. స్వాతంత్ర్య వీరులను దేశ పౌరులందరూ గుర్తు చేసుకోవాలని కోరారు. భారత దేశం పురోగతి చెందాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.