byసూర్య | Wed, Aug 10, 2022, 10:37 AM
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావతి భర్త టిఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి విజయేందర్ రెడ్డి తండ్రి ప్రతాప్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భం గా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే , టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పెద్ద అంబర్ పేటలోని వడ్డేపల్లి విజేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి, బాటసింగారం బ్యాంక్ డైరెక్టర్ గంట శ్రీనివాస్, పాలడుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.