byసూర్య | Tue, Aug 09, 2022, 10:03 PM
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 31,629 నమూనాలను పరీక్షలు చేయగా అందులో 494 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్లో 223, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, 1,054 మంది కరోనా నుండి కోలుకున్నారు. కొత్త కరోనా మరణాలు ఏవీ నమోదు కాలేదు.తెలంగాణలో ఇప్పటివరకు 8,26,778 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,17,560 మంది కోలుకున్నారు.ఇప్పటివరకు 4,111 మంది కరోనా కారణంగా మృతి చెందారు.