byసూర్య | Tue, Aug 09, 2022, 08:51 PM
కేసీఆర్ ప్రభుత్వం పోయే సమయం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం పల్లె గోసలో బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో భాగంగా ఆయన మాట్లాడారు. మూడున్నరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. పింఛను కూడా ప్రతినెలా రావడం లేదని, మూడు నెలలు ఆలస్యంగా వస్తోందని ఆరోపించారు. ప్రతినెలా 1వ తేదీన పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.