ఆ మెసేజ్ కామంధుడిని కటకటల పాలు చేసింది

byసూర్య | Mon, Aug 08, 2022, 05:23 PM

నమ్మిన వారి చేతిలో అత్యాచారానికి గురైన వారు బయటకు చెప్పుకోలేని సందర్బాలు ఎన్నో ఉంటాయి. అలాంటి ఘటనే హైదరాబాద్ లో నెలకొంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని గదిలో బంధించిన యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువకుడు చిన్మయి సైక్యా (22)తో పరిచయం ఏర్పడింది. ఈ నెల 4న యువతి ఇంటికి వెళ్లిన యువకుడు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 


విషయం బయటపెడితే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే, ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి మెసేజ్ చేసింది. అది చూసిన ఆమె వెంటనే బాధితురాలి సోదరికి చెప్పడంతో ఆమె అప్రమత్తమైంది. ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.


Latest News
 

అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు Thu, Mar 28, 2024, 04:31 PM