byసూర్య | Sat, Aug 06, 2022, 02:11 PM
న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కును జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్ తన ఓటు హాక్జును సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్ లోని, డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఉద్యమస్ఫూర్తి ప్రదాత, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో, సహచర ఎంపీలతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.