byసూర్య | Sat, Aug 06, 2022, 01:07 PM
గంజాయి అక్రమ రవాణా కేసులో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని సర్దార్ బస్తీకి చెందిన గుమ్మడి రమేష్ కు 14 ఏళ్లు కఠిన జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ శుక్రవారం కొత్తగూడెం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎం. శ్యామ్ శ్రీ తీర్పునిచ్చారు. 2018 ఫిబ్రవరి 7న హైదరాబాద్ కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం భద్రాచలం వద్ద బొలేరో వాహనంలో మరో వ్యక్తితో కలిసి గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు.