byసూర్య | Sat, Aug 06, 2022, 01:00 PM
కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండక తప్పదని వైద్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అడపాదడపా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయని వారు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా నియోజకవర్గంలోని పలు మండలాల్లో కరోనా తీవ్రత అంతగా లేకపోయినా, ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. కరోనా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదని, నిబంధనలు పాటిస్తే మరీ మంచిదన్నారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు కూడా మాస్కులు ధరించి నిబంధనలు పాటించాలని ప్రభుత్వ వైద్యులు సూచిస్తున్నారు.