ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

byసూర్య | Sat, Aug 06, 2022, 12:59 PM

భువనగిరి మండలం కేసారం గ్రామానికి చెందిన కాశపక నరేష్ (27) కునూర్ గ్రామానికి చెందిన ముల్లె నర్సింగ్ రావు ఇంట్లో (మెస్ట్రీ) ఇంటి నిర్మాణ పని చేస్తుండగా శుక్రవారం ప్రమాదవశాత్తు పైన ఉన్న 11 కెవీ కరెంట్ వైర్ తగిలి అక్కడికక్కడే పడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేశ్ మృతితో కెసారంలోని మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బోరున విలపిస్తున్న భార్య పిల్లలను చూసిన వాళ్లు కన్నీరు మున్నీరయ్యారు. భార్య శిరీష పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కేసారం గ్రామస్తులు కోరుతున్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM