byసూర్య | Sat, Aug 06, 2022, 12:56 PM
ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఎస్సారెస్పీలోకి వరదనీరు వచ్చి చేరుతుంది. 14 గేట్లను ఎత్తి వరదనీరును గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టులో 1091 అడుగులు ఉండగా 1088 అడుగులు కాగా 90 టీఎంసీలకు 78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ, ఎస్కేప్ 8000 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 600 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కులు ఉండగా వరదకాలువకు 5000 క్యూసెక్కులు, ఆలీసాగర్ కు 600 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఇన్ ప్లో 89 వేల క్యూసెక్యుల వరదనీరు రాగా కాగా అవుట్ ప్లో 75 వేల క్యూసెక్కుల నీటిని 14 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదిలినట్లు తెలిపారు.