byసూర్య | Sat, Aug 06, 2022, 12:49 PM
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జీఎం దేవేందర్ కు శనివారం వినతిపత్రం అందించినట్లు టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి గడ్డం రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయంలో లంచ్ సమయంలో సీటింగ్; టైల్స్, షెడ్, వాష్ బేసిన్ నిర్మించాలని, క్యాంటీన్ హాల్ విస్తరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యాలయ అసిస్టెంట్ పిట్ కార్యదర్శులు యుగంధర్, మంకయ్య, కమిటీ సభ్యులు దేవేందర్, సురేన్రెడ్డి, సిబ్బంది సంతోష్, సత్యనారాయణ, రాజకిరణ్ తదితరులున్నారు.