టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలపై...బీజేపీ కన్ను

byసూర్య | Sat, Aug 06, 2022, 03:37 AM

టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక అంశాలనే తనకు అనుకూలంగా మల్చుకోని ముందుకెళ్లాలని తెలంగాణపై ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో  అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇతర పార్టీల నేతల చేరికలను భారీగా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని.. మంచి సబ్జెక్ట్ ఉన్న నేతలు పార్టీలో చేరే విధంగా చర్యలు ప్రారంభించింది. ఆ బాధ్యతలను మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటలకు అప్పగించింది. ఇప్పటికే.. బీజేపీలో ఇప్పటికే చాలామంది తెలంగాణ ఉద్యమకారులు జాయిన్ అయ్యారు. భవిష్యత్తులోనూ మరింత మందిని చేర్చుకునే విధంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.


తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారని.. బీజేపీ పదేపదే చెబుతోంది. వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారందరూ బీజేపీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాంట్లో నిజం ఎంతున్నా.. ఇప్పటికే చాలామంది తెలంగాణ ఉద్యమకారులు కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఏళ్లు కేసీఆర్ వెన్నంటే నడిచిన ఈటల రాజేందర్ మాధవనేని రఘునందన్ రావు, విజయశాంతి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి కీలక నేతలు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.


అయితే.. ఇన్నాళ్లు చాలామంది రాజకీయ భవిష్యత్తుపై భయంతో.. బయటకు రాలేదు. కానీ.. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డు సమావేశాల్లో గులాబీ దళపతి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలకు కాకుండా.. నాడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం, ఇతర కీలక పదవులు కట్టబెట్టడాన్ని చాలామంది ఉద్యమకారులు జీర్ణించుకోలేక పోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలా అసంతృప్తితో ఉన్నవారే టార్గెట్ గా బీజేపీ అడుగులు వేస్తోంది.


ఈ విషయంలో ఈటల రాజేందర్ పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆయనకు ఉద్యమ నేపథ్యం ఉండటం, పరిచయాలు ఉండటం, ప్రజల్లో కూడా మంచి పేరు ఉండటంతో.. ఆయన ద్వారా చేరికలను ప్రోత్సహించాలని ప్లాన్ చేసింది. ఏకంగా జాయినింగ్ కమిటీని ఏర్పాటు చేసి.. దానికి కన్వీనర్ గా ఈటలను నియమించింది కేంద్ర నాయకత్వం. ఆ బాధ్యతలకు అనుగుణంగానే ఈటల కూడా పనిచేస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా.. చాలామంది నేతలు బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, అన్ని రకాల బలాలు ఉండటం, కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి ఉండటంతో.. వారు కూడా బీజేపీలో చేరడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఎన్నికలకు సమయం ఉన్నందునా.. ఇప్పుడే బీజేపీలో చేరడం ఎందుకు అనే భావనలో కొందమంది నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు బీజేపీ వైపు.. బీజేపీ ఉద్యమకారులపై చూస్తోందని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి అర్థం అవుతోంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM