గ్రామీణ ప్రాంతాలపై బీజేపీ నజర్...అక్కడి జనంకు చేరువయ్యేందుకు యత్నాలు

byసూర్య | Sat, Aug 06, 2022, 03:36 AM

గ్రామీణ ప్రాంతాల్లో పట్టుసాధిస్తేనే అధికారం సాధ్యమని గుర్తించిన బీజేపీ ఆ దిశగా బలపడేందుకు అడుగులు వేస్తోంది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో బీజేపీ యాక్టివిటీ బాగా పెరిగింది. బండి సంజయ్ నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయ్యే వరకు కాస్త కూల్ గా ఉన్న బీజేపీ నేతలు.. ఆ ఫలితాల తర్వాత దూకుడు పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాదు.. టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయని పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే.. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో మద్దతు ఉండబోదని టీఆర్ఎస్ పార్టీ కొట్టిపారేసింది. టీఆర్ఎస్ నేతలు చేసిన ఆ కామెంట్స్ ఓక విధంగా బీజేపీకి ఉపయోగపడ్డాయని చెప్పాలి.


గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని అప్పటినుంచి బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీని గ్రామీణ ప్రాంత ప్రజలకు దగ్గర చేసింది. సంజయ్ పాదయాత్ర చేస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో.. ప్రభుత్వ వ్యతిరేక వర్గం బీజేపీ వైపు చూసింది. ఫలితంగా కొన్నిచోట్ల ప్రజలు సంజయ్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల స్పందన, సంజయ్ పాదయాత్రతో జోష్ మీదున్న బీజేపీ క్యాడర్.. అమిత్ షా ఎంట్రీతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తోంది.


టార్గెట్ తెలంగాణ మిషన్ స్టార్ట్ అయ్యాక.. ఎన్నోసార్లు కేంద్ర నాయకత్వం ఓ సంకేతాన్ని బలంగా తెరపైకి తీసుకొచ్చింది. టీఆర్ఎస్ పార్టీపై పోరాడుతున్న బండి సంజయ్, రాష్ట్ర నాయకత్వానికి తాము అండగా ఉన్నామని పలుమార్లు సంకేతాలు ఇచ్చింది. బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి ధైర్యం చెప్పారు. ఇక ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభకు అమిత్ షా వచ్చి మరింత ఊపును ఇచ్చారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయంలోనూ కేంద్ర నాయకత్వం గట్టిగానే స్పందించింది.


ఇలా సమయం, సందర్భం వచ్చినప్పుడు కేంద్ర నాయకత్వం ఇక్కడి నేతలకు అండగా ఉంటూ వచ్చింది. తెలంగాణలో బలపడాలి అంటే.. ముందు ప్రజలకు నమ్మకం కలిగించాలని అనే వ్యూహాన్ని బీజేపీ పక్కాగా అమలు చేసింది. దీంతో ఇన్నాళ్లు భయపడిన వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇటీవల భాగ్యనగరంలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతోనూ రాష్ట్ర బీజేపీకి తాము అండగా ఉన్నామని మోదీ, అమిత్ షా ద్వయం క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు.


తాజాగా.. ఈనెల 21న కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మునుగోడు వ్యవహారంపై చర్చ జరుగుతున్న సమయంలో అమిత్ షా ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఎక్కడా తగ్గకుండా.. టీఆర్ఎస్ పార్టీపై దూకుడు పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వ తమకు అండగా ఉందని.. ఎలాంటి భయం లేకుండా బీజేపీలో చేరాలని సంకేతాలు ఇస్తున్నారు. ప్రజలకు, నేతలకు నమ్మకం కలిగించడం బీజేపీ వ్యూహాల్లో ఒకటి. దాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తోంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM