![]() |
![]() |
byసూర్య | Fri, Aug 05, 2022, 09:07 PM
తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.అయన కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాసోజు శ్రవణ్ లాంటి మేధావిని పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని , ఆయన్ను కూడా పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తనకు తెలుసునని అన్నారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కాంగ్రెస్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించిన వెంకట్ రెడ్డి.. చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.