byసూర్య | Fri, Aug 05, 2022, 08:53 PM
మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోయినా తమకు పట్టింపు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 2 టీఆర్ఎస్, 2 బీజేపీ గెలుపొందాయన్నారు. ఉపఎన్నికల్లో ఓడినంత మాత్రాన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా ఊడిందా అని అన్నారు. ఎమ్మెల్యే కాకుంటే అమిత్ షా ఇంటిముందు కుక్క కూడా దగ్గరకు రానివ్వదని, ఉపఎన్నికలతో మునుగోడు అభివృద్ధి అవుతుందనుకుంటే కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీచేయాలని తెలిపారు.