byసూర్య | Fri, Aug 05, 2022, 04:04 PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీలో కీలక నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్కు శుక్రవారం రాజీనామా చేశారు. గతంలో ఆయన హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. అయితే ఇటీవల ఆ నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువయ్యాయి. దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పార్టీలోకి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.