byసూర్య | Fri, Aug 05, 2022, 04:02 PM
ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను టీఆర్ఎస్ నేత కె.కేశవరావు శుక్రవారం విడుదల చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం విశేషం.