byసూర్య | Fri, Aug 05, 2022, 04:00 PM
హైదరాబాద్ పాతబస్తీ మొఘల్పురా సుల్తాన్షాహీ ప్రాంతంలో శుక్రవారం దారుణం జరిగింది. అఫ్సర్ అనే వ్యక్తి కుక్కలను తరిమేందుకు ఎయిర్గన్తో కాల్చాడు. అతడి గురి తప్పడంతో ఊహించని ప్రమాదం జరిగింది. కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలుడు ఆజాన్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అఫ్సర్పై పోలీసులు కేసు నమోదు చేశారు..