byసూర్య | Fri, Aug 05, 2022, 01:57 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో డాగ్స్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఆలయ, భక్తుల భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజన్న ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. రాజన్న భక్తులు ప్రజలు అత్యవసర సమయాల్లో డయల్ 100 ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.