byసూర్య | Fri, Aug 05, 2022, 01:28 PM
వనపర్తి జిల్లా కేంద్రంలో దుండగులు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. బుధవారం అర్ధ రాత్రి కర్నూల్ రోడ్డు లోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హెచ్ డిఎఫ్ సి ఏటీఎంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం మిషన్ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి లో ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని పరిశీలించారు. ఏటీఎం సెంటర్లోని కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎంత డబ్బు పోయిందనే విషయం తెలియాల్సి ఉన్నది.