byసూర్య | Fri, Aug 05, 2022, 01:13 PM
సంగారెడ్డి పట్టణంలోని పి. సంతోష్ ఇంట్లో బ్రహ్మ కమలం గురువారం రాత్రి వికసించింది. అన్ని పూల మొక్కలకు కాండానికి మొగ్గలు ఎదిగి పువ్వులుగా వికసిస్తే బ్రహ్మ మాత్రం ఆ తీగకు ఉండే ఆకు నుండి ఉద్భవించడం మరో విశేషం. పుష్పం వికసించగానే సంతోష్ కుటుంబ సభ్యులు దీపాలు వెలిగించి, టెంకాయను కొట్టి పూజలు నిర్వహించి సంతోషపడ్డారు. అనంతరం పుష్పాన్ని తీసుకువెళ్లి స్థానిక వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి మొక్కులు సమర్పించుకున్నారు.