byసూర్య | Fri, Aug 05, 2022, 01:03 PM
మునుగోడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేయకుంటే గెలిచే వాడివా రాజగోపాల్ రెడ్డి అని మునుగోడు నియోజకవర్గ టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోసుకొండ వెంకటేష్ ఈ సందర్భంగా ఆయనను ప్రశ్నించారు. సోమవారం పత్రిక ప్రకటన ద్వారా ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు ముగ్గురు ఎంపీల విజయంలో టిడిపి కార్యకర్తల శ్రమ ఉందని ఆయన గుర్తు చేశారు. మీ స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన మరియు కార్యకర్తల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మునుగోడు ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హెచ్చరించారు