byసూర్య | Fri, Aug 05, 2022, 12:50 PM
శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ దళితబంధు యూనిట్లను అందజేశారు. పిల్లోనిగూడ, గండిగూడ, రామంజాపూర్, పెద్దతూప్ర గ్రామాల్లోని పలువురు లబ్దిదారులకు కార్లు మంజూరయ్యాయి. వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని వారి కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జెడ్పీటీసీ తన్వీరాజు, సర్పంచ్ బుచ్చమ్మ, ఎంపీటీసీ సరితారవీందర్, ఉప సర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు జుర్కి రమేష్, శ్రీధర్ గౌడ్, మహేష్, శ్రీశైలం, మల్లేష్, చింటూ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.